కొడాలి నానికి క్యాన్సర్…పేర్నినాని కౌంటర్‌ అదుర్స్‌ !

-

టీడీపీ పార్టీపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందని, వంశీని అరెస్టు చేసారని టీడీపీ వాళ్లు శునకానాందం పొందుతున్నారని ఆగ్రహించారు. టీడీపీ గుండాలపై ఎదురు తిరిగిన వంశీపై కేసులు పెట్టారని… వంశీ న్యాయపరంగా రిలీఫ్ పొందిన తర్వాత వస్తారన్నారు పేర్ని నాని. టీడిపి వాళ్లు ఎన్నాళ్లు ఇలా శునకానందం పొందుతారో చూద్దామని పేర్కొన్నారు.

 

ప్రజలకు మేలు చేయటం టీడీపీ పక్కన పెట్టేసిందని…. వైసీపి జెండా మోసినా వారిని జైల్లో పెట్టడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇసుక, మట్టి, లే అవుట్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటున్నారని పేర్ని నాని చెప్పడం జరిగింది. మీటింగ్స్ లో మాత్రం అమరావతి, అభి వృద్ది, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని ఆగ్రహించారు పేర్ని నాని. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి…డబ్బులు ఉన్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version