ఏపీ ప్రజలకు షాక్‌.. ఆ ఛార్జీలు పెంచిన జగన్‌ సర్కార్‌

-

ఏపీ ప్రజలకు షాక్‌. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో వేర్వేరు సేవలకు, డాక్యుమెంట్లకు యూజర్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. మార్కెట్ విలువ సూచించే ధృవపత్రానికి రూ 10 నుంచి రూ .50కి పెంచింది. ఈసీ జారీకి రూ .10 నుంచి రూ .100కు పెంచింది. ప్రతి ఈసీ ధృవీకరణ పత్రానికి ఇక నుంచి రూ. 100 ఛార్జీ వూసలు చేయనుంది.

cm jagan

సేల్ డీడ్ లు బుక్, పవర్ ఆఫ్ ఆటార్నీలు, వీలునామా, గిఫ్ట్ డీడ్ లు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతీ డాక్యుమెంట్ కూ ఇక నుంచి రూ.500 యూజర్ ఛార్జీ వసూలు చేయనున్నారు. లక్షలోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపు ఫీజు ఇక నుంచి 50కి పెంచగా, లక్ష దాటితే రూ.100 ఛార్జీ పడనుంది. వాణిజ్య సంస్థ, బైలా సొసైటీల రిజిస్ట్రేషన్ ధృవపత్రానికి రూ.100 యూజర్ ఛార్జీ పడనుంది. పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version