తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళ 10 గంటలకు గదుల టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. డిసెంబర్ 1 తేదీ నుంచి 22వ తేదీ వరకు తిరుమల, తిరుపతి , తలకోనాలు వసతి గదుల బుకింగ్ కోటాను సెప్టెంబర్ 26వ తేదీన అంటే ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ పాలక మండలి ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

కాగా నిన్న ఉదయం 10 గంటలకు 300 రూపాయల కోట ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

చివరి రోజైన ఈరోజు ఉదయం చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని వేద పండితులు వివరించారు.ఇవాళ శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వర్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version