త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ

-

త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు. గత 5 ఏళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నేనేనని.. 53 రోజులు జైల్లో ఉంది నేనే, నన్ను చంపాలని చూశారనే ప్రచారమూ జరిగిందని తెలిపారు.

Soon the second round of nominated posts will be filled

జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారు… నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా కూడా పెట్టారని వివరించారు. కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేదని తెలిపారు. ఇంత అనుభవించిన నేను.. బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా? అని పేర్కొన్నారు. నాది ఆ స్వభావం కాదని సెటైర్లు పేల్చారు. గత 5ఏళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు నాకు తెలుసు అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, సరైన సమయంలో చర్యలు ఉంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version