చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి..లేకపోతే వెంకన్న ఊరుకోడు – వెల్లంపల్లి

-

చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి..లేకపోతే వెంకన్న ఊరుకోడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని… చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని ఫైర్ అయ్యారు. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో..లేకపోతే వెంకటేశ్వర స్వామి ఒప్పుకోడని వార్నింగ్‌ ఇచ్చారు. వరదల మేనేజ్మెంట్ ‌లో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారని… వరదల పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారన్నారు.

అందులో పదిశాతం ఖర్చు పెట్టినా బాధితులను అదుకోవచ్చు అని తెలిపారు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుదని… సాయం చేయమని కోరితే లాఠీఛార్జి చేస్తారా? అని ప్రశ్నించారు. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని… వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా? అంటూ ఆగ్రహించారు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు… హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version