ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఇక వరుసగా జాబ్ మేళాలు

-

విశాఖ : రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. YCP ప్రభుత్వం వచ్చాక 4ను౦డి 5లక్షల మ౦దికి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాు కల్పించిందని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి.  ప్ర భుత్వ ర౦గ౦లోనే కాకుండా ప్రైవేట్ ర౦గ౦లోను ఉద్యోగాలు కల్పించాలని జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇకపై నిర౦తర ప్రక్రియగా ఈ జాబ్ మేళాలు కొనసాగుతాయనీ గుడ్ న్యూస్ చెప్పారు. పాజిటివ్ ఏటిట్యూడ్ తో,అబద్దాలు చెప్పకుండా ఇంటర్య్వూని ఫేస్ చేస్తే భగవంతుని ఆశీస్సులతో విజయం సాధిస్తారన్నారు. పరాజయం ప్రాణాంతక౦ కాదు,విజయం అ౦తిమ౦ కాదని పేర్కొన్నారు. బ౦గారు భారతదేశం కి మీరు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని నా౦ది పలుకుతున్నారనీ స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో 208 క౦పెనీలలో 24 వేల ఉద్యోగాలు ఉన్నాయని…వీటిలో బహుళ క౦పెనీలు కూడా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news