జగన్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి వైఎస్ అవినాష్ రెడ్డి ?

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. సీబీఐకి సునీత రెడ్డి గతంలో ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు ఇప్పుడు బయట పడ్డాయి.

తమ నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని… నాన్న హత్య పై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పానని ఆమె వెల్లడించారు. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని ఆమె తెలిపింది.

కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదని.. బీజేపీలో చేరతాడని జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు చెప్పినట్లు సునీతా రెడ్డి షాకింగ్‌ విషయాలు చెప్పారు. ఇప్పటికే మా పై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని సునీతా రెడ్డి వెల్లడించారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాశ్‍కు గిట్టదని.. అందుకే హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని ఆమె వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news