రెండు లక్షల రుణమాఫీ స్కీములో రైతులకు మరో శుభవార్త

-

తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీపై రైతులకు మరో శుభవార్త అందించింది. జూలై 16న అధికారులతో చర్చించి రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను జూలై 18న మాఫీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.బుధవారం మిగిలిన రుణమాఫీని 2 దశల్లో డబ్బులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రూ.లక్ష వరుకు తీసుకున్న పంట రుణాలను జూలై 18న ,రూ.లక్షన్నర వరకు తీసుకున్న క్రాప్ లోన్స్ జూలై చివరి కల్లా రుణమాఫీ చేస్తామని బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్ట్ మొదటి వారంలోపు పూర్తిగా రెండు లక్షల లోపు పంట రుణలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

పేదలకు మహా లక్ష్మి (ఫ్రీ బస్) పథకం కింద 62 కోట్ల మంది ప్రయాణికులు లబ్ది పొందారని తెలిపారు. గృహ జ్యోతి 200 యూనిట్ల లబ్ది స్కీం 46 లక్షల గృహాలకు అందుతుందన్నారు సీఎం. 500 కే సిలిండర్ కు ఇచ్చేందుకు రూ.200 కోట్లు, రైతు భీమ రూ.734 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం సంక్షేమ పథకాల కోసం రూ.29 వేల కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version