Breaking : గడికోట శ్రీకాంత్ రెడ్డికి కీలక బాధ్యతలు..

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. శ్రీకాంత్ రెడ్డి ఈ క్యాబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలోకొనసాగుతారు.

YSRCP MLA Srikanth Reddy slams at Chandrababu, alleges of creating tensions  in the state

శ్రీకాంత్ రెడ్డి… సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల నూతన మంత్రివర్గంలో ఆయనకు తప్పకుండా స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే.

 

Read more RELATED
Recommended to you

Latest news