వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సాధించని సోము వీర్రాజు..

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి ఏపీలో ద‌ర్జాగా దోపిడీ సాగుతోంద‌ని సోము వీర్రాజు ఆరోపించారు. ఇదేదో విప‌క్షంగా ఉన్న తాము చెబుతున్న విష‌యం కాద‌ని… స్వ‌యానా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులే ఈ విష‌యాన్ని చెబుతున్నార‌ని తెలిపారు సోము వీర్రాజు. ఇలా ద‌ర్జాగా సాగుతున్న దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు కావాలంటూ సీఎం జ‌గ‌న్ నోరు విప్పాల్సిందేన‌ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోము వీర్రాజు గురువారం మధ్యాహ్నం రెండు వ‌రుస ట్వీట్లు సంధించారు.

TDP, YSRC governments failed to develop AP, says Somu Veerraju

ధాన్యం కొనేది మిల్లర్లు.. గణాంకాలు లెక్కించేది ఆర్బీకే సెంటర్లు.. ఈ విధంగా వారంతట వారే బాధ్యతలు పంచుకుని రైతుల సొమ్ము మింగేస్తున్నారంటూ సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ దర్జా దోపిడి వెనుక ఎవరు ఉన్నారన్నది దర్యాప్తు సంస్ధలు తేల్చాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. తాము మాట్లాడితే నైతికత లేదంటూ దుష్ప్రచారం చేస్తారని, ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచివేస్తారంటూ వ్యంగ్యం ప్రదర్శించిన సోము వీర్రాజు.. స్వయానా మీ సొంత పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రస్తావించిన విషయం మీకు వినిపిస్తోందా? అంటూ ఆయ‌న జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు సోము వీర్రాజు. ‘రైతుల నోట్లో మట్టికొట్టి రైతు కష్టాన్ని కోట్ల రూపంలో కూడగట్టుకుంటున్న పాపమే మీ పతనానికి నాంది’ అంటూ వైసీపీపై ధ్వ‌జ‌మెత్తారు సోము వీర్రాజు .

Read more RELATED
Recommended to you

Latest news