ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు, 2 మరణాలు

-

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్నటి కంటే ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి కరోనా కేసులు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 839 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2080602 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్ వల్ల శ్రీకాకుళం మరియు పశ్చి మ గోదావరి లలో ఒక్కొ క్క రు చొప్పు న మరణిం చారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,503 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3659 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 150 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2062440 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37,553 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,15,67,472 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news