ఏపీలో బాలికలు , మహిళలు మిస్సింగ్ … పవన్ కళ్యాణ్ ట్వీట్ !

-

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు ప్రజల నుండి సేకరిస్తున్న సమాచారాన్ని ఎవరికో ఇస్తున్నారని వారు బాలికలను మరియు మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంకా వేల సంఖ్యలో వాలంటీర్లు వచ్చాక మిస్ అయ్యారని కూడా లెక్కలు బయటకు వచ్చాయి. కానీ ఈ రోజు వరకు అవన్నీ కూడా మాటల్లోనే ఉన్నాయి. కానీ ఈ రోజు పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర హోం శాఖ లెక్కలతో సహా బాలికలు మరియు మహిళలు మిస్ అయిన సంగతిని ఆధారాలతో సహా తెలియచేశారు. ఇక ఆ లెక్కల ప్రకారం 2019 నుండి 2021 లలో 30,196 మంది మిస్ అయ్యారు. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.. ఈ అంశంపై వెంటనే ఏపీ డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.

pawan kalyanమరి ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మీడియా సమావేశం నిర్వహించి అడుగుతుందా ? ప్రభుత్వం దీనిపై ప్రజలకు ఏమని సమాధానం ఇస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version