ఏపీ రైతులకు జగన్ శుభవార్త.. వారీ ఖాతాల్లో డబ్బులు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. తుపాను వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌ మాసం లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ వల్ల.. చాలా మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 34,586 మంది రైతుల పంట.. తీవ్రంగా నష్టపోయింది.

ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతా ల్లో రూ. 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. అంతే కాదు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌. ఈ – క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ చేయనున్నారు సిఎం జగన్. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లు అందించింది జగన్ సర్కార్. ఏపీ సర్కార్  నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version