బాబు గోగినేనికి ఆ వ్యాధి..ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్స్..!

-

ఆస్ట్రాలజర్ వేణు స్వామి ..తన జోస్యంతో చాలా పాపులర్ అయిన సంగతి అందరికీ విదితమే. నాగచైతన్య-సమంతలు విడిపోతారని తాను ముందే చెప్పానని పేర్కొన్ని వేణు స్వామి అది నిజమైందని ఇంటర్వ్యూల్లో చెప్తుంటారు. ఇక తాజాగా వేణు స్వామి ..బాబు గోగినేనిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన వాదనలతో హేతువాదాన్ని ప్రమోట్ చేయడంతో పాటు తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోనూ బాబు గోగినేని పార్టిసిపేట్ చేశారు. ఓ చానల్ డిబేట్ లో బాబు గోగినేని, వేణు స్వామి మధ్య డిబేట్ జరిగింది. వేణు స్వామి చెప్పే వాటిలో నిజాలు లేవని, ఆయన కేవలం సెలబ్రిటీలను భయపెడతారని బాబు గోగినేని చెప్పారు.

ఈ క్రమంలోనే వేణుస్వామి…బాబు గోగినేని గురించి ఇన్ డైరెక్ట్ గా ఈ కామెంట్స్ చేశారు. తాను చేసిన పూజ వలనే బాబు గోగినేని భారత్ వదిలి ఆస్ట్రేలియా వెళ్లాడని తెలిపారు. తనకున్న ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగించే తాను బాబు గోగినేని ఆస్ట్రేలియాకు పంపానని అన్నారు. ఇకపోతే బాబు గోగినేని ఐదేళ్ల నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రాలేక సతమతమవుతున్నారని, ఆయనకు సంపాదన లేదని పేర్కొన్నారు.

బాబు గోగినేని మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన భార్య సంపాదనతో బతుకుతున్నారని అన్నారు. తాను ఒక్క గుమ్మడి కాయ కొడితేనే బాబు గోగినేని భారత్ వదిలి వెళ్లిపోయారని, రెండు గుమ్మడికాయలు కొడితే కనుక ఆయన ఎక్కడికి వెళ్లేవారోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రాలజర్ వేణుస్వామి.

 

Read more RELATED
Recommended to you

Latest news