సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు

-

బుధవారం నాడు కడప జిల్లా లోని ఒంటిమిట్ట లోని సుప్రసిద్ధ కోదండరామాలయంలో చలల ఘనంగ శ్రీరామ కల్యాణోత్సవం జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భం లో, కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉండగా, కాలు బెణికిందంటూ ఆయన ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకుని, అక్కడికి వెళ్ళలేరు. అయితే, సీఎం జగన్ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రారంభించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.

Former Andhra Min and TDP MLA K Atchannaidu held for alleged involvement in  ESI scam | The News Minute

ఈ విషయం పై, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, తన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని మండిపడ్డారు. సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని అన్నారు . సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న మండిపడ్డారు. నేడు జరిగిన కార్యక్రమాల్లో జగన్ బాగానే పాల్గొన్నారని, ఒంటిమిట్ట కల్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని హేళన చేశారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి వెళ్లకుండా, చిలకలూరిపేట ఎలా వెళ్లారని నిలదీశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news