వైసీపీ నేతలు సంక్రాంతిని జూద దినంగా మార్చారు : అచ్చెన్నాయుడు

-

మరోసారి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు సంక్రాంతిని జూద దినంగా మార్చారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లను కూడా బ్లాక్ చేసి.. కోడిపందాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు . అధికార పార్టీ నేతలు, మంత్రుల ఆధ్వర్యంలోనే జూద కేంద్రాలను నిర్వహించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న పోలీసులపై కూడా దాడులకు తెగబుడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రెండు రోజులైనా సామాన్యులు.. పండుగను సాఫీగా జరుపుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

మరికొన్ని చోట్ల శుక్రవారమే పందేలు మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతుండడం గమనార్హం. పందేల్లో రూ.కోట్ల సొమ్ము చేతులుమారనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పందేలు జరగనున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వైసీపీ నాయకుల వారసులే పందేల నిర్వహణ బాధ్యత చేపట్టారు. భారీస్థాయిలో పందేలు సాగే బరుల వద్ద సిట్టింగ్‌ ఏర్పాట్లు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news