ఏపీలో ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు : అచ్చెన్నాయుడు సంచలనం

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. రైతులను సీఎం జగన్ సర్కార్ అడుగడుగునా ముంచిందని.. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఫైర్‌ అయ్యారు.

టీడీపీ హయాంలో రైతుల శ్రేయస్సుకు చేసిన దానిలో పావువంతు అయినా చేశారా? అని నిలదీశారు. వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సైతం టీడీపీకి అంటగట్టాలని చూశారని.. వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సింపతితోనే జగన్ సీఎం అయ్యారని ఆగ్రహించారు.

కోడికత్తి డ్రామా సింపతికిపని చేయలేదనే వివేకా హత్యకు తెర తీశారని.. హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారన్నారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. సాధారణ ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా తెదేపాకు 150కు పైగా సీట్లు సాధిస్తాయని స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news