ఆదిలాబాద్ జిల్లాలో దారుణం..పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతు కోసిన కొడుకు

-

తనకు పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పింజరి గుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పింజరి గుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీస్ లో ఉద్యోగం చేసి విరమణ పొందాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు. చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు.

తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన అన్వేష్ తండ్రి గణపతి మెడమీద కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version