సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య

-

ఇంట‌ర్ మొదటి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని చున్నితో గొంతుకు బిగించి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని జ‌హీరాబాద్ మండ‌లంలో గ‌ల హుగ్గెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయ‌తే బుజ్జ‌మ్మ అనే మ‌హిళ‌హుగ్గెల్లి గ్రామంలో నివాసం ఉంటుంది. బుజ్జ‌మ్మ భ‌ర్త 15 ఏళ్ల క్రిత‌మే చ‌నిపోయాడు. దీంతో కుమారుడు సురేశ్, కుమార్తు మౌనిక (16) ల‌ను రోజు కూలీ చేసుకుంటు జీవ‌నం కొన‌సాగింస్తుంది. కాగ సోమ‌వారం తెల్ల‌వారుజామున నుంచే మౌనిక క‌నిపించ‌లేదు.

దీంతో మౌనిక ఆచూకీ కోసం గ్రామంలో బుజ్జ‌మ్మ విచారించింది. అలాగే బంధువుల ఇంటికి ఫోన్ చేసు క‌నుక్కుంది. అయితే సోమ వారం మ‌ధ్యాహ్నం గ్రామ శివారులో మృత దేహం ఉంద‌ని తెలిసి అక్క‌డ‌కు వెళ్లారు. తీర చూస్తే.. ఆ మృత దేహం మౌనిక దేన‌ని గుర్తించారు. గ్రామ శివారులో ఉన్న మామిడి తోట‌లో మౌనిక చున్నితోనే గొంతికు బిగించి హ‌త్య చేసిఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. త‌ల్లి ఫిర్యాదుతో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version