రాజస్థాన్ లో దారుణం.. వెండి కడియాల కోసం రెండు కాళ్లు నరికి..!

-

రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. వెండి ఆభరణాలు చోరీ చేసేందుకు నిందితులు ఓ వృద్ధురాలిని హతమార్చి రెండు కాళ్ళను నరికి అనంతరం కాళ్లను డ్రైనేజీలో పడేసిన దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి మనవరాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపింది బాధితురాలి మనవరాలు. “రాజస్థాన్ లోని జైపూర్ గల్తాగేట్ ప్రాంతం మీనా కాలనీ కి చెందిన 108 ఏళ్ల జమున దేవి నిద్రిస్తూ ఉండగా.. ఉదయం 5 గంటలకు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు.

ఆమెను లోపల నుండి బాత్రూం లోకి ఈడ్చుకుంటూ వెళ్లారు. రెండు కాళ్ళను నరికి వెండి కడియాలను ఎత్తుకెళ్లి, కాళ్లను డ్రైనేజీలో పడేశారు”. అని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. వృద్ధురాలి మెడ పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news