ఆసుపత్రికి వచ్చిన ఆంటీ తో దారుణం, అక్కడ కండోమ్ పెట్టి?

-

మధ్యప్రదేశ్ లో వింత ఘటన సంభవించింది. మొరేనా జిల్లాలోని ఆసుపత్రిలో ఒక వైద్యుడు చేసిన ఘనకార్యం తీవ్ర విమర్శలకు కారణమైంది. ధర్మాగర్ కు చెందిన రేష్మ భాయి అనే మహిళ తలకు గాయమైంది. దీంతో ఆమె స్థానికంగా ఉన్న మొరేనాలోని ఫోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చింది. అక్కడ డాక్టర్ ధర్మేంద్ర రాజ్ పుత్ అత్యవసర డ్యూటీలో ఉన్నారు.

వార్డ్ బాయ్ అనంత్ రామ్. కాటన్ ప్యాడ్ మీద మెటీరియల్ లాంటి కార్డు బోర్డు పెట్టమని డాక్టర్ ధర్మేంద్ర వార్డ్ బాయ్ కి సూచించాడు. ఈ క్రమంలో, అతను కండోమ్ ప్యాకెట్ ఉంచాడు. అది గమనించకుండా, ధర్మేంద్ర రాజ్ పుత్ గాయం మీద పెట్టేసి అలాగే కట్టుకట్టి మరొక ఆసుపత్రికి రిఫర్ చేశాడు. మహిళ గాయం తీవ్రత దృష్ట్యా ఆమెను మొరేనాలోని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ గాయానికి చికిత్స అందించగా దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అక్కడ వైద్యులు మహిళ గాయం కట్టు తొలగించి చూడగా అక్కడ కండోమ్ ప్యాకెట్ పెట్టి కట్టు కట్టారు. అప్పుడు దాన్ని చూసిన డాక్టర్లు షాకింగ్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంత ఉద్యోగ నిర్వహణలో అలసత్వం చూపినందుకు సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version