బాబు కొత్త స్కెచ్..వైసీపీ కంచుకోటలపై ఫోకస్.!

-

వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని స్కెచ్ లతో ముందుకెళుతున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయన..ఈ సారి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే పార్టీ నేతల చేత కూడా హార్డ్ వర్క్ చేయిస్తున్నారు. ఇక గతానికి భిన్నంగా ఎన్నికలకు ముందే అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించాల్సి ఉంది.

 

అదే సమయంలో వైసీపీకి పట్టున్న స్థానాలపై బాబు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ సారి ఆయా  స్థానాల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే జోన్ల వారీగా సమావేశాలు పెట్టుకుంటూ..బాగా పనిచేసిన వారిని మెచ్చుకుంటూ..సరిగా పనిచేయని వారికి క్లాస్ తీసుకుని ఇంకా బాగా పనిచేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీకి బాగా పట్టున్న స్థానాలు, టి‌డి‌పి వీక్ గా ఉన్న స్థానాల్లో బాబు డైరక్ట్ గా పర్యటించడానికి ప్లాన్ చేసుకున్నారు.

ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాబు పర్యటన ఖరారైంది..నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటించనున్నారు. వీటిల్లో నూజివీడు, గుడివాడ స్థానాల్లో వైసీపీ బలంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానాల్లో బాబు ..టి‌డి‌పికి కొత్త ఊపు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు.

ఇదే సమయంలో ఈ నెల 19వ తేదీ నుంచి బాబు..పశ్చిమ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ టీడీపీకి పెద్ద బలం లేని విషయం తెలిసిందే. అందులో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాల్లో బాబు పర్యటించనున్నారు. ఈ  మూడు స్థానాల్లో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. అలాగే ఈ స్థానాల్లో గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఇప్పటికీ వైసీపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో బాబు పర్యటనతో మూడు చోట్ల టీడీపీకి ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. మరి చూడాలి వైసీపీ కంచుకోటల్లో టి‌డి‌పి బలం పెరుగుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news