నయా భారత్, నవీన భారత్ కోసం కేసీఆర్ అడుగులు – బాల్క సుమన్

-

నయా భారత్ ,నవీన భారత్ కోసం కేసీఆర్ అడుగులు పడాలి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ బాల్క సుమన్ పేర్కొన్నారు. బంగారు భారత్ కోసం కేసీఆర్ ముందుకు సాగాలని.. కేసీఆర్ వెంట టిఆర్ఎస్ శ్రేణులు ఉంటాయని తెలిపారు. తెలంగాణ లో అమలు అవుతున్న కార్యక్రమాలు దేశంలో అమలు కావాలని కోరారు.

మళ్ళీ కేసీఆర్ ఉద్యమం కోసం నడుం కట్టాలి …దేశమును కాపాడుకోవడానికి… మేమెంత కేసీఆర్ వెంట ఉంటామని ప్రకటించారు. బిజెపి ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దేశం కోసం ఏమి కావాలో చెబుతున్నారు.. కానీ మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు.

దేశంలోని అన్ని వర్గాల వాళ్ళు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని.. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులము కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సినదిగా కోరుతున్నామని వెల్లడించారు బాల్క సుమన్. మోడీ సర్కార్ దుర్మార్గపు పాలన దేశంలో నడుస్తోంది.. మోడీ నాయకత్వం లో దేశంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఫైర్‌ అయ్యారు. చేతకాని దద్దమ్మల అసమర్థ పాలన దేశంలో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news