మాంత్రికుడు చెప్పాడనే..TRS ను BRS గా మార్చాడు – బండి సంజయ్‌

-

కెసిఆర్ దయ్యాల, రాక్షస క్షుద్ర పూజలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కెసిఆర్ కుటుంబ అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు… భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఒక పెద్ద స్వామీ కలిశారు…. కెసిఆర్ రమ్మంటే అయన పోలేదు… అయన నాకో విషయం చెప్పారన్నారు.

కెసిఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజారుతాడని.. కెసిఆర్ చాలా రోజుల నుండి తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాంత్రికుడి సూచన మేరకు మాత్రమే TRS ను BRS గా మార్చాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం కీర్తించే వ్యక్తి అయిన మోహన్ భగవత్ పై కేటీఆర్ తన స్థాయిని మరిచి కామెంట్స్ చేసారన్నారు. అయన కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపొడని.. Rss లాంటి సంస్థ పట్ల మాట్లాడే స్థాయి లేదని ఆగ్రహించారు.
చిల్లర మాటలను కేటీఆర్ ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news