వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందం – బండి సంజయ్‌

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందం కుదిరిందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగం ప్రగతి భవన్ స్ర్కిప్ట్ అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ఎన్నడో ఖాయమైందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇస్తారన్నారు. గ్రూప్-1లో ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి నియామకాలను రద్దు చేసి తీరుతామన్నారు ఎంపీ బండి సంజయ్.

డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి ఎందుకు ఇవ్వడం లేదని ఇక్కడి కేసీఆర్ ను అడగలేని అసమర్థులు టీఆర్ఎస్ నేతలు అని..ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు వరకు జీతాల్లేవు. బ్యాంకులు లోన్లు ఇస్తలేరు. ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆర్టీసీ కార్మికులకు 5 టీఏలు, 2 డీఏలు ఇవ్వడం లేదని ఆగ్రహించారు బండి సంజయ్. కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో ఐదుగురికి పదవులిచ్చి నెలనెలా రూ.25 లక్షల జీతాలు ఠంచన్ గా తీసుకుంటున్నారని…దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? శ్రీకాంతా చారి ఆత్మ క్షోభిస్తోందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version