పార్లమెంట్ లో బన్సూరి స్వరాజ్…సుష్మా స్వరాజ్ ను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు

-

దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని ఎన్డీఏ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతిపై 78,370 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అయితే, గురువారం పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమములో నూతనంగా ఎన్నికైన ఎంపీగా బన్సూరి స్వరాజ్ కూడాపాల్గొన్నారు. మొదటిసారిగా పార్లమెంట్‌కు వచ్చిన మీకు అమ్మ గుర్తుకొస్తుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించింది. అందుకు సమాధానంగా బన్సూరి స్వరాజ్ ప్రజాస్వామ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ప్రజలు తనను నమ్మి పార్లమెంట్‌కు పంపారని వారికి ఏదైనా మంచి చేయాలనే తన సంకల్పమని అన్నారు. ప్రజలకు తనకు సేవ చేసేందుక ఓ మంచి అవకాశం ఇచ్చారని దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version