ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. ఇక సంతకాలు అవసరం లేదు !

-

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. మీ ఆరో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఇంటర్ బోర్డ్. మే ఆరో తేదీ నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.

హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని, హాల్టికెట్ల పై ఫోటోలు అలాగే సంతకాలు సవరణ అవసరం అయితేనే కాలేజీ ప్రిన్సిపాల్ ను సంప్రదించారని బోర్డు తాజాగా ప్రకటించింది. హాల్ టికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బంది పెడితే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ నెంబర్ లకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది బోర్డు. తమకు ఫిర్యాదు చేస్తే ఆ కళాశాలల పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version