ప్రధాని మోడీ రామగుండం పర్యటనను అగ్నిగుండంగా మారుస్తాం – తెలంగాణ విద్యార్థుల సంఘం

-

గుజరాత్ కో న్యాయం తెలంగాణ విద్యార్థుల కో న్యాయమా.? మోడీ గో బ్యాక్ అనే నినాదం ఎత్తుకుంది తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థు ఐక్య కార్యాచరణ కమిటీ. సమాధానాలు చెప్పకుంటే.. నవంబర్ 12 న ప్రధాని మోడీ రామగుండం పర్యటన అగ్నిగుండంగా మారుద్దని హెచ్చరిస్తున్నారు తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు.

తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును తొక్కిపట్టాలిని చెప్పింది కేంద్ర ప్రభుత్వమా? నరేంద్ర మోడీనా ఎవరో స్పష్టం చేయాలని.. తక్షణమే యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును బేషరతుగా ఆమోదించి విద్యార్థులకు న్యాయం చేయాలి…వుయ్ వాంట్ జస్టిస్ అని పేర్కొన్నారు.

రావాల్సిన ఉద్యోగాలను అడ్డుకుంటూ తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును అడ్డుకుంటున్న గవర్నర్ ను ఎగేస్తున్న బిజెపి కేంద్రం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. తన పిచ్చి చేష్టలతో తెలంగాణ విద్యార్థుల జీవితాలను అంధకారంగా మార్చాలని చూస్తున్న గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి ఎనిమిదేండ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి సాయం గుండుసున్నా…అని ఆగ్రహించింది తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థు ఐక్య కార్యాచరణ కమిటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version