జగన్ సర్కార్ కు బీజేపీ వార్నింగ్ … నిప్పుతో చెలగాటమాడవద్దు అంటూ ఫైర్

-

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ, వైసీసీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు రసవత్తంగా ఉన్నాయి. తాజాగా బీజేపీ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా నిరసన సభలోబీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీసీ అవలంభిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఇటీవల ఆత్మకూరు ఘటనపై బీజేపీ జాతీయ నేతలు స్పందించారు. సభకు ముఖ్యనేతగా హాజరైన బీజేపీ నేత అరుణ్ సింగ్, జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. యూపీలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి అజాంఖాన్ ఏం చేసినా.. మైనారిటీలపై కేసులు పెట్టొద్దు అనేవాడు… అమాయకులపై కేసులు పెట్టించే వాడు.. ఇప్పుడు అతడు జైలులో ఉన్నాడు. వైసీపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సిందే అని హెచ్చరించాడు. పై వాళ్లు అన్నీ చూస్తున్నాడని వార్నింగ్ ఇచ్చాడు. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. బీజేపీ అంటే ఫైర్ అని.. నిప్పుతో చెలగాటం ఆడవద్దని.. కాలిపోతావ్ అని తీ వ్రస్థాయిలో హెచ్చరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news