బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది – మల్లు రవి

-

అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ని కలిశారు కాంగ్రెస్ నేతలు. డీజీపీ అందుబాటులో లేకపోవడం తో అడిషనల్ డీజీ ని కలిసి వినతి పత్రం అందజేశారు. బీజేపీ సోషల్ మీడియాలో.. రాహుల్ గాంధీ, ప్రియాంక పై కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. బిజెపి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలా పై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని.. 2 జి స్కామ్ , కోల్డ్ స్కామ్ లో తప్పు చేయలేదని విచారణ సంస్థలే ప్రకటించాయన్నారు. తప్పు జరగలేదని విచారణ సంస్థలు చెప్పినా భారీ కుంభకోణాలు జరిగాయని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశామని వివరించారు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version