BREAKING : తెలంగాణ బీజేపీ పార్టీలో తీవ్ర విషాదం

-

తెలంగాణ బీజేపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌ లో బీజేపీ నేత జ్ఞానేందర్‌ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జ్ఞానేందర్‌ ప్రసాద్.. గంట సేపటి క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు జ్ఞానేందర్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు. దీనిపై ఇంకా వివరాలు తెలియ రాలేదు. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బీజేపీ నేత జ్ఞానేందర్‌ ప్రసాద్‌ ఆత్మహత్య పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంతాపం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version