‘ది కశ్మీర్​ ఫైల్స్’​ చూసి వస్తుండగా.. బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి !

-

కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే అప్పటి నుంచి ఈ సినిమా థియేటర్ ల లో చాలా విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బెంగాల్ లో బిజెపి ఎంపీ కారు పై బాంబు దాడి కలకలం రేపింది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి తిరిగి వస్తుండగా తన కారుపై దుండగుల బాంబులు విసిరి అని బిజెపి ఎంపీ జగన్నాథ సర్కార్ ఆరోపణలు చేశారు.

నదియా జిల్లాలోని హరి గంట పోలీస్ స్టేషన్‌ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని…. ఆయన వివరించారు. ది కాశ్మీర్‌ ఫైల్స్ సినిమా చూసినందుకే చంపేందుకు ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిందితులను వెంటనే పట్టుకుని.. రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version