ఓటమి అని తెలిసి బీజేపీ మీద దాడులకు దిగుతున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

-

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యిందని ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, కేసీఆర్ కుటుంబం చెప్తోన్న గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదని, ప్రజలను, పాలన గాలికి వదిలేసి ఢిల్లీలో కేసీఆర్ చక్కర్లు కొడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ఓటమి గ్రహిస్తూనే టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పనులకు తెగపడింది. ఓటమి అని తెలిసి బీజేపీ మీద దాడులకు దిగుతున్నారు. చవకబారుప్రచారం ను ప్రజలు చీదరిస్తున్నారు. మునుగోడు ను ఇప్పుడు దత్తత దేనికి ఇన్నేండ్లు ఏం చేశారు.. ఇప్పటివరకు జరిగిన  ఉప ఎన్నికల్లో మీరిచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు..

MP K Laxman : కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం.. క్లిన్ స్వీప్  చేయడమే బీజేపీ లక్ష్యం - NTV Telugu

మీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా పని చేయలేని దద్దమ్మ నా అందుకే ktr దత్తత తీసుకుంటున్నట్లు ఉంది. మందులు, విందులు, చిందుల తో అధికార పార్టీ పగటి వేశగాళ్ళ లాగా ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తో గట్టుప్పల్ మండలం వచ్చింది, చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారు ఇది రాజీనామా ద్వారా వచ్చింది. బీజేపీ ఉద్యమం, ఒత్తిడి వల్లనే గొల్ల – కురుమలకు నగదు బదిలీ జరిగింది. చండూరు, చౌటుప్పల్ లో సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు రాజీనామా ద్వారా నే సాధ్యం అయ్యింది. గిరిజన బంధు పేరుతో మోసం చెయ్యాలని, రిజర్వేషన్ పేరుతో నాటకాలు చేస్తున్నారు.. కానీ అడవి బిడ్డ, గిరిజన మహిళ ను రాష్ట్రపతి చేసిన బీజేపీ వైపే గిరిజన బిడ్డలు బ్రహ్మరథం పడుతున్నారు.. కాంగ్రెస్ పోటీ ఉనికిని చాటుకోవడానికే టీఆర్ఎస్‌- కాంగ్రెస్ ల ది డూప్ ఫైట్. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసి మురికిల పడ్డట్టే.. అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news