మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు.. విచారణ నిలిపివేయాలని బీజేపీ పిటిషన్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుకు సంబంధించి హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలంటూ ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సిట్‌ ఏర్పాటును నిలిపి వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామీలను  మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ నుంచి ముగ్గురు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను రెండ్రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version