ప్రభుత్వంపై రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోంది : మంత్రి బొత్స

-

అభిప్రాయభేదాలను పక్కనబెట్టి అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వంపై రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అసత్యాలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. గ్రామ, పట్టణ వార్డులలో సమన్వయ కర్తల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకొక్క సచివాలయానికి ఒక మహిళలతో పాటు ముగ్గురిని సమన్వయకర్తలుగా నియమించాలన్నారు.

Andhra Pradesh: Capital shifting at any moment, stresses Botsa Satyanarayana

ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తటం తొలుత నేర్చుకోవాలని, కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదని అన్నారు. ప్రభుత్వ బాకీలన్నీ కొన్ని రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్మోహణరెడ్డి అందించినంత గౌరవం గతంలో ఏ ముఖ్యమంత్రి అందించలేదని అన్నారు. ఈ మధ్య టీడీపీ నేత అశోక్ గజపతిరాజు మాటలు వింటుంటే ఆయనకు పిచ్చి ఏమైనా పట్టిందా? అనిపిస్తోందన్నారు మంత్రి బొత్స.

Read more RELATED
Recommended to you

Latest news