రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై సి.ఎస్. సోమేశ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేదికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీ.ఎస్. సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళి అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకుని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సి. ఎస్.సోమేష్ కుమార్ అన్నారు.

పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 30మంది ప్రముఖ కవులచే కవి సమ్మేళనం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీ.ఎస్. సోమేష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version