బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరి ప్రాణాలను బలిగొన్న న్యూ ఇయర్‌ జోష్‌

-

నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. అయితే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్‌ జోష్‌ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. రోడ్డుపక్కన టిఫిన్‌ చేస్తున్న ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. అప్పటికీ ఆగని కారు.. ఆగిఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్‌ మద్యం సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version