బ్రహ్మానందం ఇంట్లో సంబరాలు.. ఈసారి మహాలక్ష్మి అంటూ పోస్ట్ వైరల్..!!

-

టాలీవుడ్ లో హాస్యనటుడిగా లెజెండరీ కమెడియన్ గా పేరుపొందిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మానందం ముఖ ఛాయలోనే ఎంతో కామెడీ చేయగలరు. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో అవకాశాలు తగ్గిన అప్పుడప్పుడు పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. తాజాగా బ్రహ్మానందం ఇంట్లో పండుగ వాతావరణ నెలకొన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తాజాగా మరొకసారి బ్రహ్మానందం తాత అయ్యారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ సతీమణి జోత్స్న పండంటి పాపకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తన కుమారుడు అప్పుడే పుట్టిన చెల్లిని చూపిస్తూ ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఇక అమ్మాయి పుట్టడంతో తమ ఆనందం మరింత రెట్టింపు అయిందని తెలియజేశారు. ప్రస్తుతం గౌతమ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంపై మంచు లక్ష్మి, బిందు మాధవి తదితర సెలబ్రిటీలు సైతం బ్రహ్మానందం గౌతమ్ దంపతులను అభినందిస్తూ ఉన్నారు.

బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు కాగా గౌతమ్ హీరోగా కొన్ని చిత్రాలలో నటించారు. మొదట 2004లో పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా బాగానే సక్సెస్ అయ్యారు. కానీ ఆ తరువాత చదువు నిమిత్తం విదేశాలకు పంపారు.ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి వచ్చిన గౌతమ్ మళ్లీ సినిమాలలో నటించారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. చివరిగా భీమ్లా నాయక్ సినిమాలో ఒక పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం ప్రస్తుతం పంచతంత్రం అనే సినిమాలు నటిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version