ఏపీకి కేంద్రం గుడ్‌ న్యూస్‌..కేంద్ర బడ్జెట్‌ లో రూ. 42 వేల కోట్లు కేటాయింపు

-

ఏపీకి కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ కి కేంద్ర బడ్జెట్ లో 42 వేల కోట్లు కేటాయించామని…గతంలో ఎపుడూ కేంద్రం ఈ స్థాయిలోబడ్జెట్ కేటాయించలేదని తెలిపారు కేంద్రమంత్రి దేవు దేవుసిన్హ్ చౌహన్. ఏపీ లో స్పెషల్ స్టేటస్ పెరు లేకపోయినా 48 వేల కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

68 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం కొనసాగుతోందని… ఎయిమ్స్ కోసం 6 వేల కోట్లు కేటాయించామన్నారు కేంద్రమంత్రి దేవు దేవుసిన్హ్ చౌహన్. కర్నూలు లో డి ఆర్ డిఓ కోసం 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తరువాతనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రపంచంలో చాలా దేశాలు దివాళా తీస్తున్నాయి..ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ,శ్రీలంక వంటి దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని.. భారత్ ఆర్థిక మాంద్యం ను ఎదుర్కొని నిలదొక్కుకుంటుందన్నారు కేంద్రమంత్రి దేవు దేవుసిన్హ్ చౌహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version