కేశినేని నానికి కేంద్రం కీలక పోస్ట్

-

సొంత పార్టీలో ఇమడలేక, ఇతర పార్టీలోకి వెళ్లలేక ఈ సతమతమవుతున్న విజయవాడ ఎంపీ కేసీనేని నానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం జాతీయస్థాయిలో తాజాగా పలు నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్రం ఓ కీలక పోస్టులో నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

టిడిపి తో పాటు ఇతర పార్టీలతోనూ పోరాడుతున్న కేశినేని ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ చైర్ పర్సన్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కేంద్ర పథకాలకు ఆయన ఇకపై కీలకం కానున్నారు. దీంతో కేశినేని నానికి దక్కిన పోస్టుపై ఎప్పుడూ టిడిపి తో పాటు మిగతా పార్టీలలోనూ చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version