Breaking : టీడీపీ మీడియా కోర్డినేటర్‌ అరెస్ట్‌.. చంద్రబాబు ఆగ్రహం

-

ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఎందుకు.. ఏ కేసులో అరెస్ట్‌ చేస్తు్న్నారో కూడా చెప్పకుండా అరెస్ట్‌ చేస్తుండటం శోచనీయం. అయితే.. తాజాగా.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి చెందిన‌ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దార‌ప‌నేని న‌రేంద్ర‌ను సీఐడీ అధికారులు బుధ‌వారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని త‌న నివాసంలో న‌రేంద్ర ఉండ‌గా…అక్క‌డికి వ‌చ్చిన సీఐడీ అధికారులు ఆయ‌న‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏ కేసులో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నార‌న్న విష‌యాన్ని సీఐడీ అధికారులు వెల్లడించ‌లేద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. న‌రేంద్ర‌ను అదుపులోకి తీసుకున్న విష‌యాన్ని సీఐడీ అధికారులు ఇంకా ధృవీక‌రించ‌లేదు. దీంతో న‌రేంద్ర కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే… న‌రేంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఖండించారు. నరేంద్రను విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

AP CM Chandrababu Naidu says EVMs turning out to be big threat to democracy

కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ పోలీసుల తీరు మారడం లేదని మండిపడ్డారు చంద్ర‌బాబు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనేదే సీఎం జగన్ వైఖర‌ని ధ్వ‌జ‌మెత్తారు చంద్ర‌బాబు. ఇటువంటి కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా….పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు చంద్ర‌బాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news