అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు – చంద్రబాబు

-

అయ్యన్న పాత్రుడి ఇంటిపై దాడి సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు అని విమర్శలు చేశారు చంద్రబాబు. అయ్య‌న్న‌ ఇంటి గోడ అర్ధ‌రాత్రి జేసీబీతో కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపేనని నిప్పులు చెరిగారు.

టీడీపీలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కి జ‌గ‌న్‌ పాల్ప‌డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చోడ‌వ‌రం మినీ మ‌హానాడు వేదిక‌గా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారనే అక్క‌సుతోనే అయ్య‌న్న‌ ఇంటిపై చీక‌టి దాడులు చేయించారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. అయ్య‌న్న‌ అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఏ ఒక్క‌దానికైనా స‌మాధానం ఇచ్చే ద‌మ్ములేని జ‌గ‌న్‌ కూల్చివేతల‌కి పాల్ప‌డ్డారన్నారు. అయ్య‌న్న‌పాత్రుడి వెంట తెలుగుదేశం పార్టీ ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news