BREAKING : ఈనెల 11,12 తేదీలలో కర్నూలులో చంద్రబాబు పర్యటన

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 11,12 తేదీల్లో చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన చేయనున్నారు. 11న ఎమ్మిగనూరు, 12న పత్తికొండ, కర్నూలు నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది.

ఈ పర్యటనలో 12 న ఆధునీకరించిన టీడీపీ ఆఫీస్ ప్రారంభించనున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇది ఇలా ఉండగా, అయ్యన్నపాత్రుడు రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన ఘటనపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. అయ్యన్న రిమాండ్ కు కోర్టు తిరస్కరించడంతో పాటు అక్కడికక్కడే అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు అయిన విషయంపై చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది అంటూ చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news