శ్రీవారి సేవల సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

-

ఏడు కొండల శ్రీవెంకటేశ్వరస్వామిరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్న సీజేఐ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వచనం చేశారు.

Justice Ramana visits Tirupati Balaji temple ahead of taking charge as CJI

ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికమయింది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. గురువారం శ్రీవారిని 70,019 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం సమకూరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news