Breaking : సభాస్థలికి బయలు దేరిన మోడీ..

-

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఉదయం 8 గంటలకు ప్రధానిని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు వీరు ముగ్గురూ హెలికాప్టర్ లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. ఏపీలో రూ. 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, మరోవైపు ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

PM to unveil Bhadrachalam road to Sattupalli railway line on Saturday

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం 4 వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా తరలివస్తున్న జనాలతో మద్దిలపాలెం జంక్షన్ అంత జన సంద్రంగా మారింది. మరోవైపు మోదీ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news