కుప్పం ప్రజలకు సీఎం జగన్ తీపికబురు

-

చంద్రబాబు ఇలాక అయిన కుప్పం ప్రజలకు తీపి కబురు అందించారు సీఎం జగన్‌. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను జూన్‌ లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. జలవనరుల శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు జూన్‌ కల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌ కు అధికారులు పేర్కొన్నారు.

వీటన్నింటితో పాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం జగన్‌.. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణ పై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశించారు. లిఫ్ట్‌ స్కీంల నిర్వహణ కోసం ఎస్‌ఓపీ…ఏళ్ల కొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలనపడుతున్నాయని తెలిపారు అధికారులు. ఇక దీనిపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశౄరు. వీటి నిర్వహణపై ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్న సీఎం సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news