రైలు ప్రమాదంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఒడిస్సాకు అమర్‌ నాథ్‌

-

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఘటనా స్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం వెళ్లనుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేశారు.

అవసరమైన పక్షంలో ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం చేయనున్నారు సీఎం జగన్‌. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు 278 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన 900 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 7NDRF, 5ODRF, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్, లోకల్ పోలీసులు, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version