త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశం : సీఎం జగన్‌

-

ముస్లిం సోదరులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్‌ ఒకటి. అయితే ఈ బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్, త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు సీఎం జగన్‌. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారన్నారు.

CM YS Jagan Mohan Reddy's two-day tour in YSR district from today

భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు సీఎం జగన్‌. అయితే.. ఇదిలా ఉండే.. నేడు వైసీపీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రేపు బక్రీద్‌ పండుగ ఉన్నా కూడా ప్లీనరీకి వచ్చి ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news