BREAKING : ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

-

BREAKING : ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఈ మేరకు ప్రగతి భవన్‌ సిబ్బంది అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

అయితే.. రాష్ట్రపతి ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనుండటంతో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జాతీయ రాజకీయాలపై విపక్షాలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లున్నారని సమాచారం అందుతోంది. కాగా…ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇవాళ 11 గంటల ప్రాంతంలో కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనున్నారు సీఎం కేసీఆర్. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.

ఈ నెల 18 వ తేదీనే ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణ సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కడెం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లలేదు. దీంతో సోమవారం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news