Corona News: గడిచిన 24 గంటల్లో 30,549 మందికి పాజిటివ్

-

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30 వేల 549 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 422 మంది కరోనాతో చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 3 కోట్ల 17 లక్షల 26 వేల 507 మందికి కరోనా సోకింది. మొత్తం 4 లక్షల 25 వేల 195 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 38 వేల 887 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3 కోట్ల 8 లక్షల 57 వేల 467 మంది బాధితులు కరోనా చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 4 లక్షల 4 వేల 958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 47 కోట్ల 85 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారని కేంద్రవైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

corona cases | కరోనా కేసులు
corona cases | కరోనా కేసులు

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ మరింత విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అంటున్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news